1. బోపన్న జంటకు మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్
భారత టెన్నిస్ వెటరన్ స్టార్ బోపన్న మియామి ఓపెన్ టైటిల్నూ సొంతం చేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి అతను విజేతగా నిలిచాడు. పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్ 1000 ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా తన రికార్డు (నిరుడు ఇండియన్ వెల్స్ టైటిల్)ను 44 ఏళ్ల బోపన్న మెరుగుపరుచుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. రిజిస్ట్రేషన్ల రాబడి రూ.14,483 కోట్లు
ప్రభుత్వ ఖజానాకు ఆదాయపరంగా కీలకమైన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ రాబడుల్లో స్వల్పంగా వృద్ధి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.14,483.05 కోట్ల రాబడి లభించింది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగంతోపాటు ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ల రాబడి కూడా దీనిలో ఇమిడి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఆకలికేకలు
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు భాగాల్లో 2023 చివరి నుంచి దుర్భిక్షం తాండవిస్తోంది. గ్రామీణ జింబాబ్వేలోని 27 లక్షల మంది బాధితులను ఆదుకొనే లక్ష్యంతో పని చేస్తున్న అమెరికాకు చెందిన ‘యూఎస్ఏఐడీ’ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) సంస్థ కూడా ఇప్పుడు చేతులెత్తేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం
భాజపా అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్.కె.ఆడ్వాణీకి భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. బెంగాల్లో తుపాను బీభత్సం
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఆకస్మిక తుపాను బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా నలుగురు మృత్యువాతపడగా.. మరో 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.