* ఏప్రిల్ 21న నిర్వహణ
ఈనాడు డిజిటల్, అమరావతి: వచ్చే విద్యాసంవత్సరాని(2024-25)కి రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లోని ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 21న జరిగే ప్రవేశ పరీక్ష అయిదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రాయవచ్చని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
హాల్టికెట్ల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.