ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. ఈ ఏడాది 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ మూల్యాంకనం కొనసాగుతుందని వెల్లడించారు. 25వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.