ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్కు హాజరయ్యే అభ్యర్థులకు సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ల్లోనూ ఏప్రిల్ 25 వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. పదోతరగతి పరీక్షలు రాసినవారు ఈ శిక్షణకు హాజరుకావొచ్చని, ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. చివరిరోజున ప్రీఫైనల్ ప్రవేశపరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాలిసెట్కు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ 5 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.