* పరీక్ష తేదీలో మార్పు లేదు
ఈనాడు డిజిటల్, అమరావతి: పాలిసెట్-2024 దరఖాస్తు గడువును ఏప్రిల్ పదో తేదీ వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు శుక్రవారం(ఏప్రిల్ 5)తో ముగిసినా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేకుండా ఏప్రిల్ 27నే జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాంకేతిక విద్యాశాఖ ఇస్తున్న ఉచిత శిక్షణకు ఆదరణ ఉందని.. దానికి అనుగుణంగా 8వ తేదీ నుంచి మరో బ్యాచ్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నాగరాణి పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.