* ఎంపికైన వారి జాబితా ఇదే..
* మొత్తం 1,924 ఖాళీల భర్తీ
హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం(ఫిబ్రవరి 29) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను బుధవారం (ఫిబ్రవరి 28) విడుదల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి (సబ్జెక్టుల వారీగా) ప్రాథమిక జాబితాలు ఇవే..
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ |
సివిక్స్,ఎకనామిక్స్,హిస్టరీ,కామర్స్ |
తెలుగు, హిందీ, ఉర్దూ |
ఇంగ్లిష్ |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.