* జనవరి 31 వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువు 2024 జనవరి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. గడువులోగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం (డిసెంబర్ 30) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు ఆదివారం(డిసెంబర్ 31)తో ముగియనుంది. అయితే కొన్ని ప్రొఫెషనల్, పీజీ కోర్సుల ప్రవేశాలు ఆలస్యమవడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈపాస్ గణాంకాల ప్రకారం రెన్యువల్ విద్యార్థులు 8,04,304 మంది ఉంటే ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.