* తాజాగా షెడ్యూల్ను మార్చిన విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ను విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఇప్పటికే రెండు దఫాలు మారగా...తాజాగా మూడోసారి టైంటేబుల్ను ఏప్రిల్ 4 విడుదల చేసింది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒకటి నుంచి ఏడో తరగతి పరీక్షలు, 9 నుంచి 11.45 గంటల వరకు ఎనిమిదో తరగతి, 9 నుంచి 12గంటల వరకు తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్ గందరగోళంగా ఉందని పరీక్షలు ముగిసిన తర్వాత రోజునే ఫలితాలు ఇవ్వడం ఎలా సాధ్యమని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ ప్రశ్నించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.