ఐఐటీ బాంబేతో కళాశాల విద్యాశాఖ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఐఐటీ బాంబే ‘స్పోకెన్ ట్యుటోరియల్’ ప్రాజెక్టు ద్వారా ఇస్తున్న ఆడియో వీడియోల శిక్షణను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు ఐఐటీ బాంబేతో కళాశాల విద్యాశాఖ ఏప్రిల్ 6న ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యాకమిషనర్ బుర్రా వెంకటేశం, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు జాతీయ సమన్వయకర్త సాయిని ఆకాంక్ష, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి.యాదగిరి, రాజేంద్రసింగ్, ఇతర అధికారులు బాలభాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. మూడేళ్లుగా అమలవుతున్న ఈ ఒప్పందంలో భాగంగా 50 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50 వేల మంది విద్యార్థులకు ఐటీ స్కిల్స్, కంప్యూటర్స్, యానిమేషన్, మల్టీమీడియా వంటి వివిధ రకాల నైపుణ్య, ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగ మేళాలను నిర్వహించి వారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు గాను ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులకు ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.