* మొత్తం 7,547 ఉద్యోగాల భర్తీ
* త్వరలో అందుబాటులో అడ్మిట్ కార్డులు
ఈనాడు ప్రతిభ డెస్క్: దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) నియామకాల శారీరక సామర్థ్య పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు దిల్ల్లీలోని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఆఫీస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే అడ్మిట్ కార్డులు అందుబాటులో రానున్నాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 85,867 మంది అభ్యర్థులకు జనవరి 13 నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ)లను నిర్వహించనున్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు రాత పరీక్షలు జరగ్గా, డిసెంబర్ 31న ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100) ప్రకారం జీత భత్యాలు ఉంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.