* హైదరాబాద్లో ఎక్కువ.. పెద్దపల్లిలో తక్కువ పోస్టులు
హైదరాబాద్: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.