* టీఎస్పీఎస్సీ ప్రకటన
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని వెల్లడించింది. గ్రూప్-1 కోసం దాదాపు నాలుగు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇటీవల 19న నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.