• facebook
  • whatsapp
  • telegram

వర్సిటీలు.. ఖాళీలు

విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల కొరత

చదువులపై తీవ్ర ప్రభావం



ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు.. సహ ఆచార్యుల పదవీవిరమణలు విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 11ఏళ్ల నుంచి వర్సిటీల్లో శాశ్వత నియామకాలు చేపట్టకపోవడం.. మూడు దశాబ్దాల క్రితం సహాయ ఆచార్యులుగా ఉద్యోగాల్లో చేరిన వారు క్రమంగా ఉద్యోగ విరమణ చేస్తుండటంతో పోస్టులు వేగంగా ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ నెలాఖరు వరకు హైదరాబాద్‌లోని ఐదు విశ్వవిద్యాలయాల్లో 60మందికి పైగా ఆచార్యులు, సహ ఆచార్యులు పదవీ విరమణ చేశారు. కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి.



బోధన అంతంతే.. ప్రాజెక్టులు వెనక్కి..

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులు కొరత కారణంగా విద్యార్థులకు సరిగా తరగతులు జరగడం లేదు. ఉస్మానియా, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జేఎన్‌ఏ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయాల్లోని కొన్ని విభాగాల్లో ఒకరిద్దరు ఆచార్యులు మాత్రమే ఉన్నారు. దీంతో పరిశోధనలు చేసేందుకు సహకరిస్తున్న సంస్థలకు వెనక్కి వెళ్తున్నాయి. ఇలా ఏటా రూ.800కోట్ల విలువైన పరిశోధన ప్రాజెక్టులు తరలిపోతున్నాయని విశ్రాంత ఆచార్యులు, విద్యానిపుణుల అంచనా. ఒక్కో ప్రాజెక్టుకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకూ ప్రాయోజిత సంస్థలు వెచ్చిస్తున్నాయి.


సహాయ ఆచార్యులుంటేనే.. వర్సిటీల్లో బోధనాప్రమాణాలు మెరుగుపడాలన్నా, బహుళజాతి సంస్థలకు ప్రాజెక్టులు, పరిశోధనలు చేయాలన్నా సహాయ ఆచార్యులుంటేనే సాధ్యం. శాశ్వత నియామకాలు చేపట్టకపోవడంతో అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పనులు చేస్తున్నారు కదా అన్న ధోరణిలో గత ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీని పక్కనపెట్టింది. దీంతో అసోసియేట్‌ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందుతున్నారు. శాశ్వత పద్ధతిలో నియమితులైన అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్లతోపాటు విధులు నిర్వహిస్తున్నా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండడంతో కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులుండడం లేదు. ఇప్పటికైనా క్రమబద్ధీకరించాలని ఉస్మానియా, జేఎన్‌టీయూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీల కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.