‣ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏప్రిల్ 19న హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయసు 6 ఏళ్లు ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్కు చెందిన పి.పరీక్షిత్రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 2020 జాతీయ విద్యా పాలసీకి అనుగుణంగా పాఠశాల విద్య, అక్షరాస్యత కేంద్ర మంత్రిత్వశాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయసు 6 ఏళ్లుగా నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. దీన్ని సడలించడం ద్వారా ప్రీప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికీ పరిమితిని సడలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేగాకుండా విద్యార్థులకు సెల్ఫోన్ అనేది వ్యసనంగా మారుతోందని.. దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. పిటిషన్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం కేంద్రంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.