* సుప్రీం కోర్టు ఆదేశం
దిల్లీ: నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ‘నీట్- యూజీ’ సంబంధిత పిటిషన్లను జులై 22న తిరిగి విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.