‣ మొదటి విడత ఆగస్టు 5, రెండో విడత ఆగస్టు 10 న కేటాయింపు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి జులై 17న చివరి విడత అయిన అయిదో రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సెలింగ్ దాదాపు ముగిసింది. సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి జులై 22 వరకు గడువు ఉంది. జోసా కౌన్సెలింగ్ తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు (సీశాబ్) పేరిట రెండు విడతలుగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ జులై 26 నుంచి ప్రారంభమవుతుంది. 29న ఆయా సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను వెల్లడిస్తారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 5, రెండో విడత సీట్లను ఆగస్టు 10 తేదీల్లో కేటాయిస్తారు.
తొలిసారిగా హిందీలో...
జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా తొలిసారిగా ఐఐటీలో హిందీ మాధ్యమంలోనూ బీటెక్ చదువుకునే వెసులుబాటు కల్పించారు. రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పుర్లో ఈ విద్యాసంవత్సరం నుంచి హిందీ మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆంగ్లం, హిందీ మాధ్యమాలను ఎంచుకున్న విద్యార్థులను రెండు బ్యాచ్లుగా విభజించి పాఠాలు బోధిస్తారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.