• facebook
  • whatsapp
  • telegram

Medical colleges: 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు

కాంట్రాక్టు, పొరుగుసేవల విధానంలో మంజూరు 
 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 8 వైద్య కళాశాలలకు 872 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని కాంట్రాక్టు, పొరుగుసేవల విధానంలో భర్తీ చేయాలని వైద్యశాఖకు సూచించింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌ వైద్య కళాశాలలకు.. 109 పోస్టుల (25 ప్రొఫెసర్, 28 అసోసియేట్‌ ప్రొఫెసర్, 56 సహాయ ప్రొఫెసర్‌) చొప్పున మంజూరు చేశారు. ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, సహాయ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షల గౌరవ వేతనం చెల్లించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. వేతనాలను వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ విధానంలో మాత్రమే చెల్లించాలని స్పష్టంచేసింది. వీరిని తొలుత వచ్చే మార్చి 31 వరకు నియమించాలని తెలిపింది. ఈ పోస్టులను రెగ్యులర్‌ విధానంలో భర్తీచేసే వరకు లేదా ఈ పోస్టుల అవసరం ఉన్నంత వరకూ వీరిని కొనసాగించాలని సూచించింది. ఇవన్నీ కొత్త వైద్య కళాశాలలు కావడంతో బోధనకు అత్యవసరంగా సిబ్బంది అవసరమైనందున వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.

 


మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.