దిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్, రవాణా, సాంకేతిక తదితర సమస్యలను కారణాలుగా పేర్కొంది. డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘‘2018లో ఎన్టీఏ ఏర్పడినప్పటి నుంచి 240 పరీక్షలను నిర్వహించింది. 5.4కోట్ల మందికిపైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అయితే, కొవిడ్ 19 మహమ్మారి, లాజిస్టిక్, సాంకేతిక సమస్యలు, పాలనా వ్యవహారాలు, న్యాయస్థానాల ఆదేశాలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలను ఎన్టీఏ వాయిదా వేసింది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2020లో జేఈఈ మెయిన్, నీట్ యూజీ, 2021లో జేఈఈ మెయిన్, నీట్ యూజీలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
-------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.