* 2026 విద్యా సంవత్సరం నాటికి అన్నీ సిద్ధం
దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏటా పాఠ్య పుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్డేట్ చేసే పద్ధతి ఏమీ లేదు. ప్రపంచం వేగంగా మారుతోన్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను క్రమంతప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం.. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా పుస్తకాలను సమీక్షించి, నవీకరించాలని ఎన్సీఈఆర్టీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. 2023లో ఎన్సీఈఆర్టీ ప్రకటించిన న్యూ కరికులమ్ ఫ్రేమ్వర్క్ (NCF)ను అనుసరించి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తుండగా.. 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు సిద్ధం కానున్నాయి. ఈ ఏడాది మూడు, ఆరో తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల ఎన్సీఈఆర్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.