• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 01-05-2024 లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌   

1.  రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్‌ కోట’ ధ్వంసం

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

2.  కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) 48 గంటల పాటు నిషేధం విధించింది.నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్‌షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

దేశంలో జరగనున్నసార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి  18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ భేటీ అయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...





4.  తొలిసారి రూ.2 లక్షల కోట్ల మైలురాయికి జీఎస్‌టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్‌ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 




5.  ‘స్మార్ట్‌’ అస్త్ర ప్రయోగం విజయవంతం!

సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పిడో (స్మార్ట్‌) అనే ఆయుధ వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.