* 18,037 మంది హాజరు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Deputy Educational Officer) కంప్యూటర్ ఆధారిత ప్రాథమిక రాత పరీక్ష (Screening Test) మే 25వ తేదీన ప్రశాంతంగా జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వెల్లడించింది. 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 18,037 (82.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్, మెయిన్ (Main) పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.