* తేదీలను వెల్లడించిన ఏపీపీఎస్సీ
ఈనాడు, అమరావతి: వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు. జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికయిన వారికి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ అవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికచేసిన వారి జాబితానూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. శాంపిల్ టేకర్ (పుడ్ డిపార్టుమెంట్-వైద్య ఆరోగ్యశాఖ) ఉద్యోగ నియామకాలకు ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన 12న ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని కార్యదర్శి ప్రదీప్కుమార్ తెలిపారు. ఫారెస్ట్ రేంజి ఆఫీసర్స్ ఉద్యోగాల నియామకాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.