* జులై 9 వరకు అభ్యంతరాలకు గడువు
ఈనాడు ప్రతిభ డెస్క్: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 ప్రాథమిక కీ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మే 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రధాన నగరాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది హాజరయ్యారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు జులై 9 లోగా ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ నోటిఫికేషన్తో ప్రముఖ విద్యాసంస్థలు యూజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.