తిరుపతి (విద్య), న్యూస్టుడే: కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ల్లో 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నవంబరు 2న తిరుపతిలో ఆవిష్కరించారు. యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, మెరిట్ విద్యార్థులకు ఇస్తున్న ప్రాధాన్యం, క్యాంపస్ ప్లేస్మెంట్సకు సంబంధించిన విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళిక చేయాలని సూచించారు. ఉన్నత విద్య, పరిశోధనల విషయంలో కేఎల్యూ తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న మెరిట్ స్కాలర్షిప్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి విడత పరీక్ష డిసెంబరు 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్లు బొబ్బిలి సత్యనారాయణమూర్తి, హెచ్ఎస్ఆర్ మూర్తి, తిరుపతి ప్రాంతీయ మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.