* 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా
ఈనాడు, హైదరాబాద్: 2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్(JEE Main) తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు నవంబరు 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నారు. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పేపర్-1కు(బీటెక్లో ప్రవేశానికి) 8.60 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు.
జేఈఈ మెయిన్ స్టడీమెటీరియల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.