ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో ప్రవేశానికి 2024, జనవరి 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. డిసెంబరు 16న సాయంత్రంలోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ (జనరల్), డిఫెన్స్, మాజీ సైనికులు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారు రూ.650, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఆన్లైన్లో పేమెంటు గేట్ వే ద్వారా/డెబిట్, క్రెడిట్ కార్డులు/ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. పాఠశాల వెబ్సైట్: www.sainikschoolkorukonda.org ఆన్లైన్లో దరఖాస్తులను సమరించాలన్నారు. మీడియం, పరీక్ష సిలబస్, రిజర్వేషన్, ఫీజు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాల కోసం వెబ్సైట్: www.nta.ac.in/https:///exams.nta.ac.in/aissee లో చూడవచ్చన్నారు.
మరింత సమాచారం... మీ కోసం
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.