ఇంక్రిమెంటులో కోతకు బోర్డు ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పరీక్ష ఫీజు కట్టించని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో వందశాతం పరీక్ష ఫీజు కట్టించకపోతే షోకాజ్ నోటీసులతోపాటు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలని ఆర్జేడీలు, జిల్లా వృత్తివిద్యా అధికారులకు సూచించారు. విద్యార్థులు ఫీజు చెల్లించకపోతే తమపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రిన్సిపాళ్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రవేశాలు పొంది, ఆ తర్వాత మధ్యలోనే మానేస్తారు. లేదంటే ఇతర కళాశాలలకు వెళ్లిపోతారు. ఇలాంటి వారికి తమనే ఫీజు కట్టమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 5,29,457 మంది ప్రవేశాలు పొందగా.. వీరిలో 23,722 మంది పరీక్ష ఫీజు చెల్లించలేదు. ద్వితీయ సంవత్సరంలో 4,76,198 మంది ఉండగా..44,291 మంది పరీక్ష ఫీజు కట్టలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వందశాతం పరీక్ష ఫీజు చెల్లించాలని, ఎవరు చెల్లించకపోయినా ప్రిన్సిపల్దే బాధ్యత అంటూ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.