ఈనాడు, అమరావతి: గ్రామ పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. 37 మంది పిటిషనర్లకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది. సొమ్ము మొత్తాన్ని రెడ్క్రాస్ సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణాప్రసాద్ డిసెంబరు 28న ఉత్తర్వులిచ్చారు. రైతుభరోసా కేంద్రాల్లో పనిచేసేందుకు గ్రామ పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ 37 మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పశు సంవర్థక సహాయకులకు విస్తృత అధికారాలు కల్పిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు భర్తీ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీని అడ్డుకోవడం కోసం పిటిషనర్లు వ్యాజ్యం వేశారన్నారు. విస్తృత అధికారాలు కల్పిస్తున్నారన్న వాదన సరికాదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఒక్కో పిటిషనర్కు రూ.5 వేల ఖర్చులు విధించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.