• facebook
  • whatsapp
  • telegram

Medical Colleges: దేశంలో వైద్య కళాశాలలు 707కు పెంచాం

ఆయుష్మాన్‌ భారత్‌తో  కోట్ల మందికి ఆరోగ్య భద్రత
కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయ

ఈనాడు, అమరావతి: దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సేవలు అందించడంతో పాటు వైద్యుల సంఖ్యను పెంచడంపైనా మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవీయ వెల్లడించారు. దేశంలో 67 ఏళ్లలో 350 వైద్య కళాశాలలు ఏర్పాటుకాగా.. గత తొమ్మిదేళ్లలో 707కు పెంచినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక వసతుల మిషన్‌ (పీఎం అభిమ్‌) కింద ఎన్టీఆర్‌, అనకాపల్లిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు(సీసీబీ), మంగళగిరిలో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబొరెటరీల (బీఎస్‌ఎల్‌) నిర్మాణానికి శంకుస్థాపనలు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబొరెటరీల(ఐపీహెచ్‌ఎల్‌) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డిసెంబ‌రు 29న‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ అత్యవసర, సర్జికల్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ సేవలను అన్నిచోట్లా అందించేందుకు సీసీబీలు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని మాట్లాడుతూ కేంద్ర నిధులతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు సీసీబీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 సీసీబీలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పది ల్యాబ్‌లను కేంద్రం మంజూరు చేస్తే వాటిలో ఒకటి ఏపీకి ఇచ్చిందన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రూ.150 కోట్లతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌ కొవిడ్‌ సమయంలో ఎంతో ఉపయోగపడిందన్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.