ఈనాడు, హైదరాబాద్: ఇంటెలిజెన్స్ బ్యూరోలో పోస్టుల భర్తీకి చేపట్టే రాత పరీక్షలకు ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఇవ్వకపోవడంపై కేంద్రానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐబీలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారి పోస్టుల నియామకం నిమిత్తం గతేడాది నవంబరు 25న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జె.విప్లవ్బాబు వ్యక్తిగత హోదాలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని, ఇది అట్టడుగు వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కేంద్రానికి, ఐబీ డైరెక్టర్కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.