ఈనాడు, దిల్లీ: విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గతంగా అంబుడ్స్మన్ను నియమించాలని గత ఏడాది ఏప్రిల్ 11న జారీచేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్లో 13, తెలంగాణలోని 8 యూనివర్సిటీలు పాటించలేదని యూజీసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నిబంధనలను ఉల్లంఘించిన విశ్వవిద్యాలయాల జాబితాను వెల్లడిస్తూ యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ మనీష్ ఆర్.జోషి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 2023 ఏప్రిల్ 12 నుంచి నెలరోజుల్లోపు ప్రతి వర్సిటీ అంబుడ్స్మన్ నియామకాన్ని పూర్తిచేయాలని ఆదేశించామని, ఆ తర్వాత పలుసార్లు గుర్తు చేశామని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు అంబుడ్స్మన్, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార కమిటీల వివరాలను వెబ్సైట్తోపాటు, విద్యాప్రాంగణాల్లో ప్రదర్శించాలని యూజీసీ కార్యదర్శి ఆదేశించారు. ఏదైనా వర్సిటీ, కళాశాల అంబుడ్స్మన్, ఫిర్యాదుల పరిష్కార కమిటీలను నియమించకపోతే సాధారణ ప్రజలు, విద్యార్థులు తమకు ఈమెయిల్ద్వారా తెలపొచ్చని పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించిన ఫిర్యాదులను mssarma.ugc@nic.in, రాష్ట్ర వర్సిటీలకు చెందిన వాటిని smitabidani.ugc@nic.in, డీమ్డ్ విశ్వవిద్యాలయాలవి jitendra.ugc@nic.in, ప్రైవేటు వర్సిటీల ఫిర్యాదులను shakeel.ugc@nic.in కి పంపొచ్చని వెల్లడించారు.
ఏపీలో అంబుడ్స్మన్ను నియమించని వర్సిటీలు
1.ఆంధ్రకేసరి
2. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్
3. క్లస్టర్
4. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
5. ద్రవిడ
6. జేఎన్టీయూ కాకినాడ,
7. కృష్ణా
8. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్
9. రాయలసీమ
10. శ్రీపద్మావతి
11. శ్రీవేంకటేశ్వర వేదిక్
12. విక్రమసింహపురి
13.సవిత అమరావతి (ప్రైవేటు)
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.