* తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.25 లక్షల మంది విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు జనవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష జనవరి 24న ముగిసింది. బీటెక్ సీట్ల భర్తీకి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1న.. అయిదు రోజులపాటు జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.25 లక్షలు, దేశవ్యాప్తంగా 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. 27న పరీక్ష రాయనున్న వారి హాల్టికెట్లను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ఉంచింది. వాటిని డౌన్లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న సూచనలను చదివి పూర్తిగా పాటించాలని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) పేర్కొంది. ఆన్లైన్ పరీక్షలు కావడంతో చిన్న పట్టణాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జేఈఈ మెయిన్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.