ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 19 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ గడువు జనవరి 31తో ముగిసింది. కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం కాగా, ఆయా ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి రావడంలో ఆలస్యమైంది. దీంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దాదాపు 5.5 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పటికి 4.2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువు పెంచింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.