1. అజిత్ పవార్దే ఎన్సీపీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎవరిదనే విషయమై ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిష్కరించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. గాజాలో ‘ఖాళీ’ ఆదేశాలు
అక్టోబరు 7న హమాస్ దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. దీని కోసం పాలస్తీనీయులు తమ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశిస్తోంది. గాజా భూభాగంలో మూడింట రెండొంతుల (246 చ.కి.మీ.) భాగంలో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమల్లో ఉన్నట్లు ఐరాస మానవతా వ్యవహారాల సంస్థ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాల ప్రారంభం
రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లోని కేంద్రాలను డీజీపీ రవిగుప్తా, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్ వర్చువల్గా ప్రారంభించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.