జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్
షెడ్యూలు విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో బీఈడీ కళాశాలల్లో రెండేళ్ల కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీఎస్ ఎడ్సెట్-2024’ను మే 23న.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2024ని జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 10న షెడ్యూళ్లను విడుదల చేసింది.
మార్చి 4న టీఎస్ ఎడ్సెట్కు నోటిఫికేషన్ విడుదల, మార్చి 6 నుంచి మే 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 6 నుంచి 13 వరకు అపరాధరుసుంతో దరఖాస్తులు తీసుకుంటామని కన్వీనర్ మృణాళిని తెలిపారు. మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
మార్చి 5న టీఎస్ఐసెట్ నోటిఫికేషన్ విడుదల, మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొ.తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఆలస్యరుసుం రూ.250తో మే 17 వరకు, రూ.500తో మే 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, జూన్ 4, 5 తేదీల్లో పరీక్ష ఉంటుందన్నారు.
డీఈడీలో 1388 మందికి ప్రవేశాలు
టీఎస్ డీఈఈసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 2007 మందికి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో సీట్లను కేటాయించగా.. శనివారం వరకు 1388 మంది చేరినట్లు డీఈఈసెట్ కన్వీనర్ తెలిపారు. మిగిలిన సీట్ల కోసం ఈ నెల 14న మరోసారి ధ్రువపత్రాల పరిశీలన, 22న సీట్ల కేటాయింపులు ఉంటాయని సీట్లు లభించిన విద్యార్థులు, 28వ తేదీ లోగా కళాశాలల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.