సీఎస్కు ఆర్.కృష్ణయ్య వినతి
ఈనాడు,హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఖాళీలన్నింటినీ పరీక్షలు రాసిన అభ్యర్థులతో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎస్ శాంతికుమారిని కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి15న సచివాలయంలో సీఎస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘గురుకుల నియామక పరీక్షల్లో భాగంగా ఒక్కో అభ్యర్థి డీఎల్తో పాటు జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ కేటగిరిలన్నింటికీ పరీక్షలు రాశారు. ఒకటికి మించి పోస్టులకు ఎంపికైన కొందరు ఒకే పోస్టును ఎంచుకుంటారు. దీనివల్ల కొన్ని పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోతున్నాయి. అలా కాకుండా మెరిట్ ఉన్న అభ్యర్థులతో ఆయా పోస్టులు భర్తీ చేయాలని’ ఆయన కోరారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.