* ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనాథ, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీన మొదటి విడత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.