ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ-డీఎస్సీ)ల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండే విధంగా షెడ్యూల్ను నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్ను ఆదేశించింది. తుది విచారణ జరిపేందుకు కేసును ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. టెట్ నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 12న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. పరీక్షలకు సిద్ధపడేందుకు సముచిత సమయం లేకుండా షెడ్యూల్ను ఖరారు చేశారన్నారు. బుధవారం ఈ వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు
‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.