* అభ్యంతరాలకు గడువు ఫిబ్రవరి 27
ఈనాడు ప్రతిభ డెస్క్: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష కీ ఆదివారం (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా జనవరి 28న పరీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలకు ఫిబ్రవరి 27వ తేదీలోగా తెలియజేయవచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది.
ఏఐఎస్ఎస్ఈఈ-2024 కీ అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.