• facebook
  • whatsapp
  • telegram

Inter: 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 4,78,718.. రెండో సంవత్సరంలో 5,02,260 మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఫిబ్రవరి 26న ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు కోసం ఆర్టీసీని కోరాం. ఇంటర్‌ పరీక్షల్లో ఎవరైనా కాపీ కొట్టినా... ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు. కాపీయింగ్‌ పాల్పడిన విద్యార్థిని డిబార్‌ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపైనా, సంబంధిత కేంద్రం యాజమాన్యం పైనా కఠిన చర్యలు తీసుకుంటాం. 

విద్యార్థులందరికీ హాల్‌టికెట్‌ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఎవరికైనా ఇవ్వలేదని మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం’’ అని శ్రుతి ఓజా తెలిపారు.


జూనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్

గణితశాస్త్రం 1A

గణితశాస్త్రం 1B

రసాయన శాస్త్రం

వృక్షశాస్త్రం

జంతుశాస్త్రం

భౌతికశాస్త్రం

సీనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్

గణితశాస్త్రం 2A

గణితశాస్త్రం 2B

రసాయన శాస్త్రం

వృక్షశాస్త్రం

జంతుశాస్త్రం

భౌతికశాస్త్రం

ఇంటర్మీడియట్, పదో తరగతి మోడల్ పేపర్లు - 2024


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.