ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 4,78,718.. రెండో సంవత్సరంలో 5,02,260 మంది పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఫిబ్రవరి 26న ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు కోసం ఆర్టీసీని కోరాం. ఇంటర్ పరీక్షల్లో ఎవరైనా కాపీ కొట్టినా... ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. కాపీయింగ్ పాల్పడిన విద్యార్థిని డిబార్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపైనా, సంబంధిత కేంద్రం యాజమాన్యం పైనా కఠిన చర్యలు తీసుకుంటాం.
విద్యార్థులందరికీ హాల్టికెట్ ఇవ్వాలని కళాశాల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఎవరికైనా ఇవ్వలేదని మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం’’ అని శ్రుతి ఓజా తెలిపారు.
జూనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
సీనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
ఇంటర్మీడియట్, పదో తరగతి మోడల్ పేపర్లు - 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.