• facebook
  • whatsapp
  • telegram

Summative-2: సమ్మెటివ్‌-2 పరీక్షలు 6 నుంచి

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌  6 నుంచి సమ్మెటివ్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి 19తో ముగియనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతులు, ప్రైవేటులో 6-9 తరగతులకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 1-8 తరగతుల వారికి తరగతి ఆధారిత మదింపు (సీబీఏ-3) నిర్వహిస్తారు. సీబీఏ పరీక్షకు ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్‌ షీట్‌ను అందిస్తారు. 1-5 తరగతులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే ఓఎంఆర్‌ షీటు ఉంటుంది. 6,7,8 తరగతులకు లాంగ్వేజ్‌ పరీక్షలకు ఒకటి, భాషేతర సబ్జెక్టు మరో ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. ప్రైవేటు యాజమాన్యంలోని విద్యార్థులకు ప్రశ్నపత్రమే ఇస్తారు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లోని 8,9 తరగతుల వారికి 12న టోఫెల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం 22న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల పురోగతిని వివరించనున్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.