• facebook
  • whatsapp
  • telegram

Schools: పాఠశాల స్థాయి నుంచే పరిశోధనలకు ప్రోత్సాహం  

* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్‌లోని కళాశాల విద్యాశాఖ, రూసా డైరెక్టరేట్‌ల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 2న ఏర్పాటు చేసిన జిజ్ఞాస ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు వీలుగా వారితో అధ్యయన ప్రాజెక్టుల రూపకల్పన కోసం జిజ్ఞాస కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికిగాను 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 5200 మంది విద్యార్థులు అధ్యయన ప్రాజెక్టులు సమర్పించారని, అందులో 290 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేశామన్నారు. అధ్యయన ప్రాజెక్టుల ప్రదర్శన ఏప్రిల్‌ 4 వరకు సాగుతుందని, విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామని, ఉత్తమ ప్రాజెక్టులను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటామని వెంకటేశం వివరించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఏజీవో బాలభాస్కర్‌, జాయింట్‌ డైరెక్టర్లు జి.యాదగిరి, రాజేందర్‌సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.