సీఎస్కు అభ్యర్థుల వినతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మే 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. ఏప్రిల్ 24న సీఎస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్ చివరి పరీక్ష ఏప్రిల్ 30న, ఆ తర్వాత ఆరు రోజులకే ఈసెట్ పరీక్ష ఉండటంతో తాము పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామన్నారు. కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!