కోట, న్యూస్టుడే: మండలంలోని చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024-26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు మే 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ శేషావర్దన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ విభాగాల్లో 40 (ఒక్కోక విభాగం)వంతున సీట్లు ఉన్నాయని చెప్పారు. వోకేషనల్ కోర్సులో 20 సీట్లు భర్తీ చేస్తామన్నారు. వివరాలకు 84410 33367 నంబరుకు సంప్రదించాలని కోరారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!