న్యూస్టుడే, హనుమకొండ: జూన్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా సాగింది. హనుమకొండలో మొత్తం 22,665 మంది అభ్యర్థులకు గాను 17,834 మంది పరీక్ష రాశారు. 78.69 శాతం హాజరు నమోదు అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. నగరంలోని అరుణోదయ డిగ్రీ, కాకతీయ మహిళా డిగ్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. మట్టెవాడ పరిధిలోని పరీక్ష కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా సాగినట్లు కలెక్టర్ తెలిపారు.
‣ ప్రశ్నపత్రం (టెస్ట్ బుక్లెట్ నంబర్: 334380) & కీ
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్