* నిరుద్యోగులతో భేటీలో ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి హామీ
హైదరాబాద్, న్యూస్టుడే: డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం వ్యవధి మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 వాయిదాపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేలా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. వారు గురువారం (జులై 18) బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశమై.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని నిరుద్యోగులు వాపోయారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలను మే, జూన్లో నిర్వహించాల్సి ఉండగా అభ్యర్థుల డిమాండ్ మేరకు.. డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించామని బల్మూరి వెంకట్ తెలిపారు. అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు తేదీలు ఇవ్వడంతో ఇప్పుడు డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని ఎంపీ చామల వివరించారు. ఈ విషయంలో నిరుద్యోగులది న్యాయమైన డిమాండే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గ్రూప్ 2 వాయిదా వేసేలా కృషి చేస్తామని హామీఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మానవతారాయ్, బాలలక్ష్మీ, చనగాని దయాకర్, చరణ్కౌశిక్, లోకేష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.