షెడ్యూల్ ఖరారు చేసిన ప్రవేశాల కమిటీ
![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ సీట్ల భర్తీకి జులై 30న పీజీఈసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య లింబాద్రి అధ్యక్షతన జులై 19న జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు. జులై 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం 18,829 మంది అభ్యర్థులు పీజీఈసెట్లో ఉత్తీర్ణులయ్యారు. వారు సుమారు 8 వేల సీట్ల కోసం కౌన్సెలింగ్లో పాల్గొంటారు. ఆగస్టు 31న తరగతులు ప్రారంభమవుతాయి. సమావేశంలో విద్యామండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్కే మహమూద్, వెంకటరమణ, కార్యదర్శి శ్రీకారం వెంకటేశ్, ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్బాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.