* ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2024 జూన్ 16న ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 (సీశాట్) జరిగింది. ఈ ప్రకటన ద్వారా సివిల్ సర్వీసులకు చెందిన 1,056 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే జనరల్ స్టడీస్లో ప్రశ్నలు మధ్యస్థాయి నుంచి తేలికగా ఉన్నాయి. దీనిలో సుధీర్ఘమైన ప్రశ్నలు తక్కువగా.. కొన్ని నేరుగానే అడిగారు. పాలిటీలో కాస్త సులువుగా, ఇంటర్నేషనల్ ఇష్యూస్తో పాటు ఎకానమీ ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారితంగా అడిగారు. త్రీ స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు కనిపించాయి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను నుంచి పాలిటీ, జాగ్రఫీ విభాగాల్లో చాలా ప్రశ్నలు నేరుగా అడిగారు. సీశాట్లో సులభం నుంచి మధ్యస్థాయి ప్రశ్నలు వచ్చాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సైతం సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే జనరల్ కేటగిరీలో 90 కటాఫ్ మార్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ప్రిలిమినరీ కీ, ఫైనల్ కీతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
పేపర్-1లో సబ్జెక్టు వారీగా ప్రశ్నల వివరాలు…
సబ్జెక్టు | అడిగిన ప్రశ్నల సంఖ్య |
జాగ్రఫీ | 16-18 |
ఎన్విరాన్మెంట్ | 12-14 |
సైన్స్ అండ్ టెక్నాలజీ | 10-12 |
హిస్టరీ | 14-16 |
ఎకనామిక్స్ | 15-20 |
పాలిటీ | 14-16 |
కరెంట్ అఫైర్స్ | 6-8 |
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 2024 ప్రశ్నపత్రం, కీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.