• facebook
  • whatsapp
  • telegram

ముగిసిన జేఈఈ మెయిన్ మొద‌టి విడ‌త ప‌రీక్ష‌లు  

కొంచెం సులువుగా భౌతిక‌శాస్త్రం
 ప్ర‌శ్న‌ప‌త్రం స‌ర‌ళిపై విశ్లేష‌ణ‌

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 26న ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో నాలుగు రోజులపాటు రెండు విడతలుగా సాగాయి. జేఈఈ ప్రశ్నపత్రాల సరళిని గమనిస్తే ఎక్కువ ప్రశ్నలు సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళిక నుంచే వచ్చాయి. పాత పేపర్ల నుంచే 40శాతం వరకు ప్రశ్నలు ఇచ్చారు. ఆరేళ్ల పేపర్లను ప్రాక్టీస్‌ చేసిన విద్యార్థులకు ఇది కలిసి వస్తుంది. గతంలో భౌతికశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉండగా.. ఈసారి తేలికగా, మధ్యస్తంగా ఉన్నాయి. గణితం గతంలోలాగే సులభంగా, ఎక్కువ సమయం తీసుకునేలా(లెంథీగా) ఉంది. రసాయన శాస్త్రం నుంచి ప్రశ్నలు తేలికగా ఇచ్చారు. ఛాయిస్‌ విభాగంలో ఇచ్చిన ఇంటిజర్‌ ప్రశ్నలు సులభంగా ఉండడం ఈసారి విద్యార్థులకు కలిసొచ్చే అంశమని శారదా విద్యా సంస్థ‌ల గణిత అధ్యాపకులు విఘ్నేశ్వరరావు పేర్కొన్నారు. ప్రశ్నల సరళి ప్రకారం ఓపెన్‌ కేటగిరీలో ఈసారి కటాప్‌ 100 నుంచి 110 మార్కులు ఉండే అవకాశం ఉందన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.