ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్ పేపర్-1 స్కోర్ను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) మార్చి 7లోపు వెల్లడించనుంది. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-1కు 6,52,490 మంది దరఖాస్తు చేయగా వారిలో 6,20,153 మంది పరీక్షలు రాశారు. అందులో ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు 63,400 మంది ఉన్నారు. పేపర్-1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో పేపర్-1లో విద్యార్థులు సాధించిన స్కోర్ను మార్చి 7వ తేదీలోపు వెల్లడించనున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనూ పేపర్-1 పరీక్ష జరగనుంది.
‣ పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) చివరి విడతపరీక్ష మే నెలలో నిర్వహించనున్నారు. మొదటి విడత 51,229 మంది హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.